రాష్ట్రంలో మద్యంతర ఎన్నికలు వస్తాయని ప్రజలు సిద్దంగా ఉండాలని ఆయన జ్యోష్యం చెప్పాడు. దేశ ప్రదాని అన్న గౌరవం ఉంటే భారత్ బయోటెక్కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. "ఇంట్లో చెప్పే వచ్చానని.. చావుకు భయపడేది" లేదన్నారు. ట్యాంక్బండ్ విగ్రహాలను టచ్ చేస్తే కచ్చితంగా దారుసలాంను కూల్చేస్తామని మరోసారి హెచ్చరిస్తున్నట్టు బండి సంజయ్ వ్యాఖ్యానించాడు.
ఇక టిఆర్ఎస్ అక్రమ పాలన కూలే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు.ఎక్కువ రోజులు నిలబడని ప్రభుత్వానికి పోలీసులు ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావట్లేదన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే విషయాన్ని పోలీసులు గుర్తించుకోవాలన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ జైలుకు పోవటం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం సృష్టించబోతుందని ధీమా వ్యక్తం చేశారు.