గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సి‌ఎం కే‌సి‌ఆర్ ఎల్‌బి స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించారు.ఈ సభలో కే‌సి‌ఆర్ పలు కీలక అంశాలపై చర్చించారు.ఎన్నికల ప్రచారం కోసం బి‌జే‌పి నాయకులు హైదరబాద్ రావడాన్ని ఆయన తప్పుబట్టారు.వారిపై తనదైన శైలిలో సెటైర్లు వర్షం కురిపించాడు.

వరదలతో నగరం అతలాకుతలం అయినప్పుడు రాని వారు ఓట్ల కోసం ఇప్పుడు వస్తున్నారని ఎద్దేవా చశాడు.' ఒక బక్క కేసీఆర్‌ని కొట్టడానికి ఎంత మంది వస్తారు ?' అంటూ తనదైన శైలిలో చమత్కరించారు.ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ప్రచారం చెయ్యడానికి ఇవి జాతీయ ఎన్నికలా? మున్సిపల్ ఎన్నికలే కదా అని వ్యాఖ్యానించారు.

వరదల్లో మునిగిపోయి కష్టాల్లో వున్నాం.. ఆదుకోండి అని అంటే పైసా ఇవ్వలేదు... కానీ,ఓట్ల కోసం ఇప్పుడు వరదలా వస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.. ప్రజలు ఆలోచించి నాయకుల పనితీరును చూసే ఓటు వేయాలి. ప్రజలు విచక్షణతో ఆలోచించి సరైన నాయకునికి  ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: