జగనన్న తోడు ఒక బోగస్ అని టీడీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా ఆరోపించారు.  ప్రధాని దేశం అంతా ఇస్తున్న అత్మనిర్బర్ నిది పథకాన్ని పేరు మార్చారు అన్నారు. దేశంలో 50 లక్షల చిరు వ్యాపారుల కోసం ఎస్ఐడీబీఐ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేయమని కేంద్రప్రభుత్వ ఆదేశించిందన్నారు. ఇప్పటి వరకు దేశంలో 28 లక్షల మంది అప్లై చేసుకొంటే 15 లక్షల మందికి మంజూరు అయినాయన్నారు.

ఏపీలో లెక్కల ప్రకారం 1, 73,540 మందినీ మాత్రమే గుర్తించిందన్నారు. వైసీపీ రాష్ట్రంలో 10 లక్షల చిరు వ్యాపారులకు మందికి 10 వేలు ఇచ్చామని అవాస్తవాలు చెబుతున్నారన్నారు. వైసీపీ జగన్నన తోడు పై 10 లక్షల మంది ఎక్కడ ఇచ్చారో మీడియా సాక్షిగా చెప్పే ధైర్యం ఉందా అని ప్రశ్నించారు. కాగా ఇటీవల ఏపీ దీనిని ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: