ఏపీలో కొన్ని కొన్ని ఆందోళనలు కాస్త కంగారు పెడుతున్నాయి. తాజాగా మంత్రి అవంతి శ్రీనివాస్ కి షాక్ తగిలింది. ఏకంగా ఆయన ఇంటికి కార్మికులు వెళ్ళిపోయారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మంత్రి  అవంతి శ్రీనివాసరావు ఇంటికి భవన నిర్మాణ కార్మిక సంఘాల నేతలు వెళ్ళడం సంచలనంగా మారింది. ఆ సమయంలో మంత్రి అవంతి ఇంటిలో లేకపోవడంతో... మంత్రి కార్యాలయం సిబ్బందికి వినతి పత్రం అందచేసిన కార్మిక సంఘాల నేతలు... తమ డిమాండ్ లు పరిష్కరించాలి అని కోరారు.

కార్మిక సంఘాలు మంత్రి ఇంటి ముట్టడికి పిలుపు నివడంతో.. భారీగా పోలీసుల మోహరించారు. ముట్టడి కార్యక్రమాన్ని అడ్డుకున్న పోలీసులు పలువురుని హెచ్చరించారు. మరికొందరు ఆందోళకారులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ కి తరలించారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి కాస్త ఆందోళనకరంగా ఉంది అని మీడియా వర్గాలు అంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: