ఏపీ మంత్రి పేర్ని నాని పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేయడం సంచలనంగా మారింది. తాపీ తో దాడి చేసి పారిపోయే ప్రయత్నం చేసాడు ఒక వ్యక్తి. పట్టుకున్న మంత్రి అనుచరులు, పోలీసుల కు అప్పగించారు. మచిలీపట్నంలోని మంత్రి నివాసంలో నే దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతనిని స్టేషన్ కి తరలించారు. హత్యాయత్నం కింద కేసు నమోదు చేసారు.

ఈ ఘటన సంచలనం అయింది. ఇటీవల మంత్రి తల్లి మరణించగా అప్పటి నుంచి ఆయన ఇంట్లోనే ఉన్నారు. మంత్రి విధులకు కూడా కొన్ని రోజుల నుంచి దూరంగానే ఉన్నారు. ఈ ఘటన ఎందుకు జరిగింది ఏంటీ అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. కాగా ఏపీలో భవన నిర్మాణ కార్మికులు గత కొన్ని రోజుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్న సంగతి తెలిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: