బిజెపి రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్ మరొకసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు.ఉగ్రవాదులు హైదరబాద్ నడిబొడ్డున ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశాడు. హైదరబాద్ లో ప్రముఖ డాక్టర్లతో సమావేశం నిర్వహించిన ఆయన ఈ విదంగా అన్నారు. 

హైదరబాద్ కు అవినీతి అనే రోగం పట్టిందని దానికి మందు మేం పెడతాం అని అన్నారు.ఎలా మాట్లాడాలో నేను కే‌సి‌ఆర్ దగ్గరే నేర్చుకున్న అని విమర్శించారు.ఈ ఎన్నికల్లో కే‌సి‌ఆర్ కు ఓటమి భయం పట్టుకుంది అని అన్నారు.బహిరంగ సభలో ఆయన మొఖం చూస్తే అర్థమౌతుందన్నారు.. పాకిస్తాన్, బాంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు.. హైదరాబాద్ నడి బొడ్డున ఉన్నారన్నారు.

కే‌సి‌ఆర్ వారికి షల్టర్ ఈచ్చాడని ఆరోపించారు.ఒక్కసారి బి‌జే‌పికి అవకాశం ఇస్తే 24 గంటల్లో పాత బస్తీలో జల్లెడ పట్టి రోహింగ్యాలు, బంగ్లాదేశ్ , పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళను పార దోలుతామని అన్నారు. పాత బస్తీని భాగ్యనగరంగా మార్చాలని బిజెపి ప్రయత్నిస్తుందన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: