కొమురం భీం జిల్లా  ప్రజలను పెద్ద పులి కంగారు పెడుతుంది. పులి దెబ్బకు ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలి అంటేనే కంగారు పడుతున్నారు. పెంచికల్ పేట (మం) కొండపల్లి పరిసర గ్రామాల్లో ఆందోళన చోటు చేసుకుంది. నిన్న పులి దాడిలో వ్యవసాయ కూలీ నిర్మల మృతి చెందారు. రాత్రి డెడ్ బాడీని తీసుకెలుతుండగా అంబులెన్స్ కు ఎదురైన పులి... అక్కడి నుంచి కదలలేదు.

పులి అలజడితో పంట చేలకు వెళ్లేందుకు జంకుతున్న ప్రజలు... ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. పులిని బంధించి తమ ప్రాణాలు కాపాడాలని కోరుతున్నారు. నిర్మల కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయంతో పాటుగా ఆమె కుటుంబం లో ఒకరికి ఉద్యోగం ప్రకటించిన అధికారులు... ఆదుకుంటాం అన్నారు. దాడి చేసిన ప్రాంతంలో కెమెరాలతో పాటు బోనుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటన సంచలనం అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: