ఏపీలో మంత్రి  పెర్ని నానీపై జరిగిన దాడి కాస్త సంచలనం అయింది. ఈ దాడి వెనుక ఏదో కారణం ఉంది అని అధికార పక్షాన్ని టార్గెట్ గా చేసుకుని విపక్షం కొన్ని ఆరోపణలు చేస్తుంది. దాడి చేసిన వస్తువు కూడా కాస్త భిన్నంగా ఉంది. ఇక ఇదిలా ఉంటే... దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య కీలక వ్యాఖ్యలు చేసారు. ఆనాటి కోడి కత్తి దాడికి, ఈనాటి తాపీ దాడికి సారూప్యమున్నట్లుగా కనిపిస్తున్నది అని ఆయన మండిపడ్డారు.

ఆనాటి బాధితుడు ముఖ్యమంత్రి, ఈనాడు రవాణా మంత్రి అన్నారు. ఆనాడు కోడికత్తితో చంపాలనుకుంటే, ఈనాడు తాపీతో చంపాలనుకున్నాడు అని ఆయన పేర్కొన్నాడు.  ఈ ఆయుధాలతో కదలకుండా పడుకున్న మనిషిని మాత్రమే చంపగలం అని ఆయన వ్యాఖ్యానించారు.  దర్యాప్తు చేసి నిజాలు వెలికి తీస్తారా? అని ఆయన నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: