టీడీపీ సభ్యులు అవగాహనా లేకుండా మాట్లాడుతున్నారు అని ఏపీ సిఎం వైఎస్ జగన్ ఆరోపించారు. డిసెంబర్ నెలాఖరుకి ఇన్ పుట్ సబ్సిడీ అందిస్తాం అని ఆయన స్పష్టం చేసారు.  నెల రోజుల్లోనే ఇన్ పుట్ సబ్సిడీ అందించే కార్యక్రమం చేస్తామని సిఎం జగన్ అన్నారు. టీడీపీ సభ్యుడు లేవనెత్తిన అంశంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది అన్నారు.  మళ్ళీ అదే అంశంపై మాట్లాడటం సమంజసం కాదు అని సీఎం జగన్ పేర్కొన్నారు.

కాగా 12 మందిని సభ నుంచి అధికార పార్టీ సస్పెండ్ చేసింది. చంద్రబాబు సహా టీడీపీ సభ్యులను సస్పెండ్ చేసారు. సస్పెన్షన్ చేసిన సభ్యులను సభ నుంచి లాబీల్లోకి తీసుకొస్తున్నారు మార్షల్స్. లాబీల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తోన్న టీడీపీ సభ్యులు... ప్రభుత్వం నియంతృత్వంలో ముందుకు పోతుంది అని మండిపడ్డారు. సిఎం జగన్ పై మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: