గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బిజెపి నేతలు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. తాజాగా బిజెపి నేత రాజా సింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. మేము ప్రశాంత ఎన్నికలు జరగడంలో  మేము , మా కార్యకర్తలు ముందుంటాము అని ఆయన అన్నారు. చైతన్య పురి సీఐ రవికుమార్ పై ఏసీపీ కి ఫిర్యాదు చేస్తున్నాం అని ఆయన వెల్లడించారు. అతని పై చర్యలు తీసుకోవాలని  పోలీసు శాఖను కోరుతున్నాము అని ఆయన వెల్లడించారు.

ప్రతి కార్యకర్తలు రేపు ఉదయం  ఎన్నికల పోలింగ్  కేంద్రాల వద్ద అందరూ అందుబాటులో ఉండాలని కోరారు అని ఆయన పేర్కొన్నారు. చైతన్య పురి ఇన్సిపెక్టర్ పై చర్యలు  తీసుకోక పోతే   మేమే చర్యలు తీసుకోవాల్సి  వస్తుందని అన్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరగాలంటే బ్యాలన్స్ గా ఎన్నికలు జరిపించాలని , డిపార్ట్మెంట్ వారిని  కోరుతున్నామని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp