ఏపీ మాజీ సిఎం టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన ట్విట్టర్ ఖాతాలో ఎప్పుడు కూడా ఏదోక విమర్శ చేస్తూనే ఉంటారు. తాజాగా ఆయన ట్విట్టర్ ఖాతాలో చంద్రబాబు టార్గెట్ గా విమర్శలు చేసారు. చంద్రబాబు విజయాలను ఆయన ప్రస్తావించారు. మీరు 3 సార్లు సిఎం అయింది మాత్రం గాలి వాటం గానే అని ఆయన ఎద్దేవా చేసారు.

ఒకసారి ఎన్టీఆర్ గెలిపిస్తే వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్నారు అని చంద్రబాబుని ఉద్దేశించి ఆయన ట్వీట్ చేసారు. 1999, 2014లో బిజెపి ప్రభంజనంలో బయటపడ్డారు అని ట్విట్టర్ లో పేర్కొన్నారు. గాలికి కొట్టుకొచ్చింది ఎవరు? అని ఆయన ప్రశ్నించారు. 50%  ఓట్లు,151 సీట్లతో ప్రజలు సిఎం వైఎస్ జగన్  గారిని ఆశీర్వదిస్తే గాలికి గెలిచినట్టా? అని ఆయన ట్విట్టర్ లో ప్రశ్నించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: