గ్రేటర్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7గంటలకే ప్రారంభమైనా కొన్ని కొన్ని చోట్ల మాత్రం ఆందోళనలు రేగాయి. అధికార విపక్షాల నేతల మధ్య గొడవలు జరిగాయి. పటాన్‌ చెరు డివిజన్‌ లోని చైతన్య స్కూల్‌ దగ్గర టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు, కార్యకర్తలు మధ్య గొడవ జరిగింది. టీఆర్‌ఎస్‌ కార్యకర్త విష్ణు తమ కార్యకర్తల మీద దాడికి దిగాడు అని బీజేపీ అభ్యర్థి ఆశీష్‌ గౌడ్‌ ఆరోపించగా పోలీసులు రంగంలోకి దిగారు.

భారతినగర్‌ డివిజన్‌ ఎల్‌ఐజీ కాలనీ బూత్‌ వద్ద గొడవ రేగింది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింధు ఫొటోతో కూడిన స్లిప్‌ ల పంపిణీ చేయడంతో బీజేపీ అభ్యర్థి గోదావరి అంజిరెడ్డి అభ్యంతరం చెప్తూ... ఎన్నికల సంఘంపై ఆరోపణలు చేసారు. ఓల్డ్‌మలక్‌పేట్  డివిజన్‌లో సీపీఐ అభ్యర్ధి  గర్తు విషయంలో గొడవ రేగింది. కొన్ని ప్రాంతాల్లో ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: