గ్రేటర్‌ హైదరాబాద్‌లో ఓటింగ్ దాదాపుగా అన్నీ చోట్ల ప్రశాంతంగానే జరుగుతున్నా.., మరికొన్ని డివిజన్లలో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణలు చోటు చేసుకున్నాయి.గచ్చిబౌలి డివిజన్లో గోపన్‌పల్లిలో టీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తల మద్య, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగింది.

ఒకరినొకరు పరస్పరం దాడి చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అటు నాచారం డివిజన్‌లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తుంది అక్కడ కాంగ్రెస్‌ మరియు టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు కొట్టుకున్నారు.

ఇదిలా ఉంటే మరోచోట రిగ్గింగ్ కలకలం రేపింది. జంగంమెట్‌ డివిజన్‌  రెయిన్‌బజార్‌ పోలింగ్‌ బూత్‌లో ఎంఐఎం కార్యకర్తలు దొంగ ఓట్లు వేయడానికి వచ్చారని బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థితులపై నిఘా ఉంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: