ఏపీ అసెంబ్లీ సమావేశాలు కాస్త హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఈ సమావేశాలలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ముఖ్యంగా టీడీపీ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్ గా చేసుకుని ప్రతీ అంశంలో కూడా విమర్శలు చేస్తున్నారు. ఇక తాజాగా ఏపీ శాసన మండలిలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మ‌న‌సులో మాట పుస్త‌కంపై మండ‌లిలో రెండోరోజు నెల‌కొన్న‌ వివాదంలో కీలక వ్యాఖ్యలు వినిపించాయి.

వ్య‌వ‌సాయం దండ‌గ అని చంద్ర‌బాబు నాయుడు ఎక్క‌డ అన్నారో నిరూపించాలి అని ఎమ్మెల్సీ లోకేష్ సవాల్ చేసారు. మంత్రులు అనిల్ కుమార్, క‌న్న‌బాబుల‌కు స‌వాలు విసిరిన నారా లోకేష్... సిఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని మంత్రులు బొత్స‌, క‌న్న‌బాబు ఏమ‌ని విమ‌ర్శించారో మా వ‌ద్ద  ఆధారాలున్నాయి అని పేర్కొన్నారు. చంద్ర‌బాబు వ్యాఖ్య‌ల‌పై ఆధారాలుంటే నిరూపించాలని నారా లోకేష్ సవాల్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: