చైనా కోరిక మేరకు భారత్కూడా బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు అంగీకరించింది. అంతేకాదు ఇక్కడ కూడా భారత్ తన పెద్ద మనసు చాటుకుంది. మిగతా దేశాలకంటే తక్కువ ధరకే చైనాకు బియ్యాన్ని ఎగుమతి చేసేందుకు ఒప్పుకుంది. ఇప్పటివరకూ లక్ష టన్నుల బియ్యం కోసం ఇక్కడి వ్యాపారులతో చైనా వర్గాలు ఒప్పందాలు చేసుకున్నట్లు భారత ఎగుమతి దారుల సంఘం ద్వారా తెలుస్తోంది. భవిష్యత్తులో ఇది మరింత పెరిగే అవకాశం కూడా ఉందని అంచనా. టన్ను బియ్యానికి 300 డాలర్లు చొప్పున ఈ సప్లై జరగనుంది. భారత్ ఎగుమతుల్లో నాణ్యత గనుక పెరిగితే.. వచ్చే ఏడాది మరింత పెద్ద మొత్తం దిగుమతి చేసుకుంటామని చైనా నుంచి సమాచారం అందిందట.
గత ఏడెనిది నెలలుగా చైనా మనతో తెగ తగువుపడుతోంది. నెపాల్, పాకిస్థాన్ దేశాలను మనపైకి చైనా ఉసిగొల్పుతోంది. ‘ప్రపంచంలో మా అంతవారు లేరు’ అని విర్రవీగే చైనా ప్రస్తుతం బియ్యం కోసం భారత్ సహాయం అర్థంచడం ఆనందించదగిన అంశం.