తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జనుడికి రెండోసారి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఆరోగ్యం విషమంగా మారింది అని సమాచారం. కొద్దిరోజుల క్రితం కరోనా పాజిటివ్ తో విజయవాడలోని ఓ ప్రవేటు ఆసుపత్రిలో చేరిన బచ్చుల... ఆ తర్వాత కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. నెగిటివ్ వచ్చాక డిశ్చార్జ్ అయిన బచ్చుల… ఇంట్లోనే ఉంటున్నారు. మళ్లీ పాజిటివ్ రావటంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించే ఏర్పాటు చేసారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.

ఊపిరి తీసుకోవటం లో ఇబ్బంది పడుతున్న బచ్చుల అర్జనుడి... ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉందని వైద్యులు తెలిపారు. అవసరం అయితే ఆయనను ఇతర రాష్ట్రాలకు అయినా పంపించి వైద్యం చేయించే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇక ఆయన ఇటీవల గన్నవరం నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: