గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అధ్యక్షుడు బండి సంజయ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. నిజామాబాద్ ఎంపీ అరవింద్, వివేక్, ఇతర నేతలు, డివిజన్ల ఇంచార్జ్ లు పాల్గొన్నారు. కౌంటింగ్ కేంద్రాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేసారు. చివరి వరకు పరిస్థితులు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచనలు చేసారు.

అధికార పార్టీ దూకుడుగా వ్యవహరించే అవకాశమున్నందున అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు ఇచ్చారు. తుది ఫలితాలు వెలువడే వరకు అప్రమత్తంగా ఉండాలని బండి సంజయ్ వారికి సూచనలు చేసారు. ఏదైనా ఘటన జరిగితే వెంటనే రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకు రావాలని ఆయన నేతలకు సూచనలు చేసారు. రాష్ట్ర పార్టీ నేతలు అందరో కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ఊచించారు. అభ్యర్ధులతో టచ్ లో ఉండాలని ఆదేశాలు ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: