బిజేపి తమ పార్టీ ఊహించిన ఫలితాలు రాకున్న మెరుగ్గానే ఓట్ల శాతం సంపాదించుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. ఇక మజ్లిస్ పార్టీ దాదాపుగా 40 కి పైగా సీట్లలో గెలవనుంది.‘పీపుల్స్ పల్స్’ సర్వే ఫలితాల ప్రకారం.. టీఆర్ఎస్కు 70-79 స్థానాలు, బీజేపీకి 25-35, ఎంఐఎంకు 38-42 స్థానాలు, కాంగ్రెస్కు 1-5 స్థానాలు వచ్చే అవకాశాలున్నాయని వెల్లడించింది. ప్లస్ ఆర్ మైనస్ మూడు శాతం. టీఆర్ఎస్ మ్యాజిక్ ఫిగర్ (76)కు చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.మిగిలిన ప్రముఖ సర్వే సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇలా ఉన్నాయి....
ఆరా సర్వేలో టీఆర్ఎస్కు సొంతంగా అధికారం (78),పీపుల్స్ పల్స్ సర్వేలో బీజేపీకి టీఆర్ఎస్కు 68 నుంచి 78,సీపీఎస్సర్వేలో టీఆర్ఎస్కు భారీ మెజార్టీ (82 నుంచి 96),ఆత్మసాక్షి సర్వేలో టీఆర్ఎస్కు భారీ సీట్లు (82 నుంచి 88) ,. దాదాపుగా అన్నీ సర్వే సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ లో టిఆర్ఎస్ పార్టీ కే పట్టం కట్టాయి.మరి రేపు విడుదల అయ్యే అసలైన ఫలితాలు ఎలా ఉంటాయన్నది అందరిలోనూ ఆసక్తి రేపుతుంది..