ప్రస్తుతం జరుగుతున్న గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ లో టీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలవబోతోందని ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేసారు. ఈ రోజు ఉదయం ఆమె మీడియాతో మాట్లాడారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో, మంత్రి కేటీఆర్ పనితీరుతో ప్రజలు అత్యధిక మెజారిటీతో టీఆర్ఎస్‌ను గెలిపిస్తారనే విశ్వాసం తమకు ఉందని ఆమె  నేడు మీడియాతో మాట్లాడుతూ అన్నారు.

నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ కూడా టీఆర్ఎస్‌కు అనుకూలంగానే వచ్చాయని ఆమె స్పష్టం చేసారు. వందకు పైగా స్థానాలు వస్తాయని కవిత ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా మళ్లీ జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగురుతుందని ఆమె వ్యాఖ్యానించారు. కాగా గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో పోస్టల్ బ్యాలెట్ లో 80 స్థానాల్లో బిజెపి ఆధిక్యంలో ఉంది. 35 స్థానాల్లో తెరాస ఆధిక్యంలో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: