గోషామహల్ నియోజకవర్గం జాంబాగ్ డివిజన్ ఓట్ల లెక్కింపు పై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. బూత్ నెంబర్ 8లో పోలైన ఓట్లు 471  బాక్స్ లో మాత్రం 257 ఓట్లు మాత్రమే ఉన్నాయి. మిగతా ఓట్లు గల్లంతు కావడంపై ఎమ్మెల్యే రాజా సింగ్ అసహనం వ్యక్తం చేసారు. బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. పోలింగ్ శాతం తప్పుగా వెల్లడించామని ఎన్నికల సంఘం అధికారులు పేర్కొన్నారు. రాజా సింగ్ మీడియాతో మాట్లాడుతూ... కేసీఆర్, కేటిఅర్ మాయ మాటలను ప్రజలు నమ్మలేదని ఆయన అన్నారు.

అన్ని కౌంటింగ్ సెంటర్ లలో బీజేపీ దూసుకెళ్తోందని ఆయన పేర్కొన్నారు. గెలుస్తామని సీఎం అనుకున్న అది రివర్స్ అయింది అని ఆయన పేర్కొన్నారు. మేయర్ పీఠం బీజేపీ దే అన్నారు. ప్రజలు బీజేపీకే ఓటు  వేసారని ఆయన ధీమా వ్యక్తం వేశారు. నియోజకవర్గ ఫలితంపై అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: