గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ లో కాస్త అలజడి రేగింది. ఈ ఎన్నికల్లో పెన్ తో చేసిన మార్క్ ఉన్న బ్యాలెట్ ని కూడా కౌంట్ చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం సంచలనం అయింది. దీనిపై బిజెపి ఫైర్ అయింది. దీనిపై హైకోర్ట్ లో లంచ్ మోషన్ పిటీషన్ దాఖలు చేసింది బిజెపి. విచారణ జరిపి వెంటనే హైకోర్ట్ ఆదేశాల్లు ఇవ్వగా ఎన్నికల కమీషన్ ఫైర్ అయింది.

హైకోర్టు ఉత్తర్వులపై లంచ్ మోషన్ దాఖలు చేయనున్న ఎలక్షన్ కమిషన్.. ఎలక్షన్ కమిషన్ వ్యవహారంలో కోర్టులు జోక్యం చేసుకోరాదని స్పష్టం చేసింది.  హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని రివ్యూ పిటిషన్ దాఖలు చేసి స్వీకరించాలని ఎలక్షన్ కమిషన్ విజ్ఞప్తి చేయనుంది. స్వస్తిక్ గుర్తు ఉన్న బ్యాలెట్ లను మాత్రమే కౌంట్ చేయాలని ఎన్నికల సంఘంకు స్పష్టం చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: