ఏపీ శాసన సభా సమావేశాల్లో టీడీపీ ఎమ్మెల్యేలకు స్పీకర్ షాక్ ఇచ్చారు. నరేగా పెండింగ్ బిల్లులు చెల్లించాలని సభలో వాయిదా తీర్మానాన్ని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. పొడియం ముందుకు వెళ్లి తెలుగుదేశం ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. సభ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసారు.

సస్పెండైన ఎమ్మెల్యేలు ఒకసారి చూస్తే... నిమ్మల రామానాయుడు, గోరంట్ల గోరంట్ల బుచ్చయ్య చౌదరి, జోగేశ్వరరావు, అనగాని సత్యప్రసాద్, బెందాళం అశోక్, మంతెన రామరాజుని సస్పెండ్ చేసారు. సభ నుంచి మొత్తం తెలుగుదేశం ఎమ్మెల్యేలు బయటకు వచ్చేశారు. లాబీ లో నినాదాలు చేస్తూ టీడీఎల్పీ కార్యాలయానికి టీడీపీ ఎమ్మెల్సీలు చేరుకున్నారు. వరుసగా అయిదవ రోజు కూడా టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేసారు. అయిదు రోజుల సమావేశాలు  నేటితో ముగుస్తున్నాయి. ఈ సమావేశాల్లో పలు కీలక అంశాల్లో చర్చ జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: