మౌలాలి డివిజన్‌లో కౌంటింగ్‌ నిలిపివేసారు. మౌలాలి డివిజన్‌లో లెక్కింపు ప్రక్రియను ఓట్లు ఎక్కువ రావడంతో నిలిపివేశారు. ఓ బ్యాలెట్‌ బాక్సులో అధికంగా 33 ఓట్లు ఉన్నాయి. మొత్తం 361 ఓట్లు నమోదు కాగా బాక్సులో  394 ఓట్లు ఉన్నాయి. దీంతో అధికారులు కౌంటింగ్‌ ను నిలిపివేశారు. వివేకానంద నగర్ లో కౌంటింగ్ సెంటర్ వద్ద బీజేపీ ఎంజెంట్లు ఆందోళనకు దిగారు.

ఇక బూతు నెంబర్ 6  ఓట్ల పోలింగ్ పై గందరగోళం రేగింది. 355 ఓట్లు పోల్ అయింటే , ఇప్పుడు 574 ఓట్లు ఉన్నాయని అధికారులు చెప్పారు. అభ్యంతరం వ్యక్తం చేస్తున్న బీజేపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. వివేకానంద నగర్ బూతు నెంబర్ 76  బాక్స్ లకు సీల్ లేదంటూ కౌంటింగ్ ను బీజేపీ ఏజెంట్లు అడ్డుకున్నారు. రిటర్నింగ్ అధికారి సునీత కు ఫిర్యాదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: