తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు రాష్ట్ర ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేసారు. ఎలక్షన్‌ ఫోబియాతో వణుకుతున్న వైసీపీ నేతలు... ఎన్నికల నిర్వహణకు భయపడుతున్నారని అన్నారు. ట్రంప్‌ 2.0లా వ్యవహరిస్తున్న జగన్‌ రెడ్డి అంటూ ఆయన విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై అసెంబ్లీలో ఏకపక్షంగా తీర్మానం సిగ్గుచేటు అన్నారు. నాడు ప్రపంచమంతా ఎన్నికలు వద్దంటే.. కావాలన్నారు అని...

నేడు ప్రపంచమంతా ఎన్నికలు జరుగుతుంటే.. వద్దంటున్నారు అని ఎద్దేవా చేసారు. విద్వేషం, విధ్వంసం తప్ప ప్రజల గురించి, ప్రజా సంక్షేమం ఏనాడైనా ఆలోచించారా? అని ఆయన నిలదీశారు. అసెంబ్లీలో ఒక్క రోజైనా మాస్కు పెట్టుకోని ముఖ్యమంత్రి, మంత్రులు కరోనా గురించి మాట్లాడడం హాస్యం అన్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేయాలని 2019 ఏప్రిల్‌ 13న ప్రధానమంత్రికి లేఖ రాసారని, ఆయన మండిపడ్డారు. ఎన్నికలు పెడితే ప్రజలు చెప్పుతో కొడతారనే భయంతో నో అంటున్నారు అని ఆయన విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: