శ్రీలంక స్టార్ క్రికెట‌ర్ అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లికారు. ఆ జ‌ట్టు స్టార్ బ్యాట్స్ మెన్‌, ఓపెనర్ అయిన ఉపుల్ త‌రంగ తాను ఇక‌పై అంత‌ర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు ప‌లుకుతున్న‌ట్టు త‌న సోష‌ల్ మీడియా ద్వారా తెలిపాడు. ఉపుల్ త‌రంగ త‌న కెరీర్‌లో మొత్తం 253 వన్డేలు ఆడి 6951 ప‌రుగులు చేశాడు. 31 టెస్టులు ఆడి 1745 ప‌రుగులు చేశాడు. ఇక 26 టీ 20 మ్యాచ్‌ల‌లో 407 పరుగులు చేశాడు. త‌రంగ త‌న చివ‌రి వ‌న్డే 2019 మార్చి 16న ఆడాడు. అప్ప‌టి నుంచి త‌రంగ వ‌న్డేల‌కు దూరంగా ఉంటూ వ‌స్తున్నాడు. శ్రీలంక జట్టుకు సుదీర్ఘ కాలంగా సేవలు అందిస్తోన్న త‌రంగ ఎడ‌మ చేతి వాడం ఆట‌గాడిగానే కాకుండా ఓపెనర్‌గా కూడా రాణించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: