తెలుగుదేశం పార్టీకి 38 సంవ‌త్స‌రాలుగా కంచుకోట‌గా ఉంటోన్న నియోజ‌క‌ర్గం హిందూపురం. అలాంటి కంచుకోట‌లో ఇప్పుడు ఆ పార్టీకి అదిరిపోయే షాక్ త‌గిలింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత రంగనాయకులు వైసీపీలో చేరారు. పార్టీ ఆవిర్భావం నుంచి రంగనాయకులు టీడీపీలో ఉన్నారు. ఆయ‌న అక్కడ బ‌ల‌మైన బీసీ నేత‌గా కూడా ఉన్నారు. 1983లో ఆయన తొలిసారి హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2004లోనూ మరోసారి హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.

2014 లో ఆయ‌న ఎమ్మెల్యే సీటు ఆశించ‌గా... చిన్న నామినేటెడ్ ప‌ద‌వితో స‌రిపెట్టారు. ఇక ఇప్పుడు పార్టీ మారిపోయారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు రంగనాయకులు టీడీపీని వీడటం ఆ పార్టీకి ఎదురుదెబ్బ. రంగనాయకులు వైసీపీ ఇన్ ఛార్జి మహ్మద్ ఇక్బాల్ సమక్షంలో వైసీపీలో చేరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: