కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఊహించని ఇబ్బందులు పడుతుంది. తిరుగులేదనుకున్న చంద్రబాబు నాయకత్వం ఇప్పుడు ఇబ్బందులు పడుతుంది. ఈనెల 25, 26, 27 తేదీల్లో చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్తున్నారు. అయితే ఈ తరుణంలో ఆయనకు ఊహించని షాక్ తగిలింది. చంద్రబాబు పర్యటన నేపధ్యంలో... పార్టీ కార్యాలయంలో కుప్పంలో సమావేశం నిర్వహించగా ... 89 పంచాయతీల్లో పోటీ చేసి ఓడిపోయిన 74 మంది, గెలిచిన 14మంది వచ్చారు.

స్థానిక నాయకులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాగా... కార్యకర్తలు నేతలను టార్గెట్ చేసి తిట్టడం మొదలుపెట్టారు. మీ వల్లే ఓడిపోయామని, ధైర్యం చెప్పలేకపోయారని వాళ్ళు నిలదీశారు. దీనితో ఆవేదన వ్యక్తం చేస్తూ స్థానిక నాయకులు అందరూ రాజీనామాలు చేసేస్తున్నారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి పీఎస్‌ మునిరత్నం, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు ఓటమికి కారణమని చెప్పడంతో వాళ్ళు రాజీనామాలు చేయడానికి రెడీ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: