పింక్ బాల్ టెస్టులో ఇంగ్ల‌డ్‌కు షాక్ త‌గిలింది. అహ్మదాబాద్‌లో టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న డే అండ్‌ నైట్‌ టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. పింక్‌ బాల్‌ టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 112 పరుగులకు ఆలౌట్‌ అయింది. టీమిండియా లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్ 38 పరుగులకే ఆరు వికెట్లు తీసి టెస్టు కెరీర్‌లో‌ అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ముఖ్యంగా భార‌త స్పిన్న‌ర్ల‌లో అక్ష‌ర్ ప‌టేల్‌, అశ్విన్ దెబ్బ‌కు ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్స్ విల‌విల్లాడారు.

భారత బౌలర్ల దాటికి ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయారు. ఓపెనర్‌ జాక్‌ క్రావ్లే(53) మినహా మిగతా ఏ బ్యాట్స్‌మెన్‌ రాణించలేకపోయారు. భారత బౌలర్లలో అక్షర్‌ 6 వికెట్లు తీయగా.. అశ్విన్‌ 3, ఇషాంత్‌ ఒక వికెట్‌ తీశాడు. ఇంగ్లండ్ ఈ ప్ర‌తిష్టాత్మ‌క స్టేడియంలో జ‌రుగుతోన్న తొలి మ్యాచ్‌లో ఇంత త‌క్కువ స్కోర్‌కు ఆల‌వుట్ అయ్యి ప‌రువు పోగొట్టుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: