ఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నేడు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. తాజా పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో పార్టీ ఘోరంగా ఓడిపోయింది. నియోజ‌క‌వ‌ర్గంలో మొత్తం 89 పంచాయ‌తీల‌కు గాను 74 చోట్ల వైసీపీ గెలిస్తే... టీడీపీ కేవ‌లం 15 పంచాయ‌తీల‌తో స‌రిపెట్టుకుంది. దీంతో ఆయ‌న కుప్పంపై అత్య‌వ‌స‌ర స‌మీక్ష చేస్తున్నారు. మొత్తం మూడు రోజుల పాటు ఆయన కుప్పంలోనే ఉంటారు.  ఈ నేపథ్యంలో చంద్రబాబు మండలాల వారీగా సమీక్షలు నిర్వహించనున్నారు.దాదాపు ఇరవై నెలల తర్వాత చంద్రబాబు కుప్పం వస్తుండటంతో పార్టీ నేతలు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: