ఏపీలో క‌రోనా తీవ్ర‌త జీరో స్థాయికి వ‌చ్చేసింది అనుకుంటోన్న టైంలో ఇప్పుడు మ‌ళ్లీ క‌రోనా కేసులు పెరుగుతూ ఉండ‌డం ప‌లువురిని ఆందోళ‌న‌కు గురి చేస్తోంది. తాజాగా ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన బులిటెన్ ప్ర‌కారం ఏపీలో 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఎవరూ మరణించ లేదు. ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో పాజిటివ్ కేసుల సంఖ్య 8,86,608 కు చేరుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీలో క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 7168 మంది మృతి చెందారు. ప్ర‌స్తుతం ఏపీలో 603 యాక్టివ్ కేసులున్నాయి. క‌రోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 8,78,837 మందికి చేరుకుంది.

ఇక కొత్త క‌రోనా కేసులు పెరుగుతుండ‌డంతో పాటు జ‌నాలు సాధార‌ణ జీవ‌నానికి అల‌వాటు ప‌డి జాగ్ర‌త్త‌లు తీసుకోకోవ‌డం.. ఇటు పాఠ‌శాల‌లు తిరిగి ప్రారంభించ‌డంతో కూడా కొత్త కేసులు పెరుగుతున్నాయి. దీనిపై ప్ర‌తి ఒక్క‌రు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: