ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికల్లో స్పీడ్ గా వెళ్తున్న ఏపీ ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇప్పుడు హైకోర్ట్ లో కేసున్నా సరే మున్సిపల్ ఎన్నికల విషయంలో వెనక్కు తగ్గడం లేదు. రాష్ట్రంలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఈ ఎన్నికల సన్నాహకాల పై మూడు ప్రాంతీయ సదస్సులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.

మొదటి ప్రాంతీయ సన్నాహాక సదస్సును ఈనెల 27న తిరుపతిలో నిర్వహించనున్న రాష్ర్ట ఎన్నికల సంఘం... రెండవ ప్రాంతీయ సన్నాహాక సమావేశాన్ని ఈనెల 28న విజయవాడలో నిర్వహించనున్నట్టు ప్రకటన విడుదల చేసింది. మూడవ ప్రాంతీయ సన్నాహక సమావేశాన్ని వచ్చే నెల 1వ తేదీన విశాఖపట్నంలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. వివిధ రాజకీయ పార్టీల గుర్తులను సైతం వెల్లడిస్తూ ప్రకటన విడుదల చేసింది ఏపీ ఎన్నికల సంఘం.

మరింత సమాచారం తెలుసుకోండి: