దేశ్యాప్తంగా కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. మహారాష్ట్రలోని లాతూర్ నగరం ఎమ్ఐడీసీ ప్రాంతంలోని ఒక హాస్టల్లో 39 మంది విద్యార్థినులకు, ఐదుగురు సిబ్బందికి కరోనా సోకినట్లు ఒక అధికారి తెలిపారు. వ్యాధి నిర్ధారించబడిన విద్యార్థినులకు తొమ్మిది, 10వ తరగతులకు చెందినవారు. హాస్టల్లో ఓ విద్యార్థినికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా మిగతా 360 మంది విద్యార్థులను పరీక్షలు చేయించారు హాస్టల్ నిర్వాహకులు. వారిలో 39 మందికి పాజిటివ్ అని తేలింది.
60 మంది బోెధన, బోధనేతర సిబ్బందిలో 30 మంది శాంపిల్స్ తీసుకున్నామని వారి రిపోర్ట్స్ సాయంకాలానికి వస్తాయని లాతూర్ మునిసిపల్ కార్పొరేషన్ ఆరోగ్య అధికారి
మహేష్ పాటిల్ తెలిపారు. వ్యాధి సోకిన విద్యార్థినులు, ఉద్యోగులు నగరానికి సమీపంలో ఉన్న ప్రభుత్వ హాస్టల్లో క్వారంటైన్ చేశామని అధికారులు తెలిపారు.