తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు రెండో రోజుల కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఆయన ఆర్ అండ్ బి అతిధి గృహంలో బస చేశారు. ఈ క్ర‌మంలోనే ప‌లువురు కుప్పం ప్ర‌జ‌లు ఆయ‌న‌కు విన‌తులు ఇచ్చేందుకు భారీ ఎత్తున వ‌స్తున్నారు. చంద్ర‌బాబు ఎంతో ఓపిక‌తో వారి నుంచి విన‌తులు తీసుకుంటున్నారు. అయితే ప‌లువురు నేత‌లు మాత్రం స్థానిక పార్టీ నేత‌ల తీరుపై బాబుకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో అవాక్క‌వ్వ‌డం బాబు వంతు అవుతోంది. అస‌లు స‌మ‌స్య‌ల కంటే కూడా ఈ ఫిర్యాదులే ఎక్కువుగా ఉంటున్నాయి. ఈ ఫిర్యాదుల స్వీక‌ర‌ణ తర్వాత రామకుప్పం మండల కార్యకర్తలతో చంద్రబాబు సమావేశం కానున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: