అనంత‌పురం జిల్లాలో టీడీపీకి పెద్ద ఎదురు దెబ్బ త‌గిలింది. ప‌రిటాల ఫ్యామిలీ కంచుకోట అయిన పెనుగొండ నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీ కీల‌క నేత ఒక‌రు జ‌డ్పీటీసీ అభ్య‌ర్థిగా ఉండి మ‌రీ వైసీపీకి జంప్ అవుతున్నారు. నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన పెనుగొండ మండ‌ల టీడీపీ జ‌డ్పీటీసీ అభ్య‌ర్థిగా ఉన్న మాజీ సింగిల్ విండో అధ్య‌క్షుడు కె. భాస్క‌ర్ రెడ్డి మంత్రి శంక‌ర్ నారాయ‌ణ స‌మ‌క్షంలో పలువురు పార్టీ నేత‌ల‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా భాస్క‌ర‌రెడ్డి పార్టీ మార్పుపై చ‌ర్చ జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఆయ‌న‌తో పాటు మండ‌లంలో ఉన్న ప‌లువురు టీడీపీ కీల‌క నేత‌లు కూడా పార్టీ మారిపోనున్నారు. ఇది పరిటాల ఫ్యామిలీకి పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: