విశాఖ జిల్లా పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి తెలుగుదేశం అధిష్ఠానం కీలక పదవి ఇవ్వాలని నిర్ణయించింది. ఆయ‌న తాజాగా జ‌రుగుతోన్న జీవీఎంసీ ఎన్నిక‌ల్లో గ్రేట‌ర్ మేయ‌ర్ పీఠం కోసం రేసులో ఉన్నారు. ఆయ‌న 2014 ఎన్నిక‌ల‌కు ముందే పార్టీలో చేరినా ఎలాంటి ప‌ద‌వులు ఆశించకుండా పార్టీ కోసం ప‌ని చేస్తున్నారు. అయితే తాజాగా ఆయ‌న మేయ‌ర్ రేసులో ఉన్నా ఇదే ప‌ద‌వి కోసం పీలా శ్రీనివాసరావు, కాకి గోవిందరెడ్డి కూడా పోటీ ప‌డుతున్నారు.

స‌మీక‌ర‌ణ‌ల వ‌ల్ల ఆయ‌న‌కు మేయ‌ర్ ప‌ద‌వి రాక‌పోతే అంత‌కంటే కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌న్న యోచ‌న‌లో చంద్ర‌బాబు ఈ రోజు నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు స‌మాచారం. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో ఆయన సబ్బవరం మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో తెలుగుదేశం మద్దతుదారులను గెలిపించుకున్నారు. దీనిపై రెండు మూడు రోజుల్లో ఒక ప్ర‌క‌ట‌న రావొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: