దేశంలో కరోనా మహమ్మారి కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. తాజాగా కొత్త కేసుల‌ను కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రిత్వ శాఖ ఈ రోజు విడుద‌ల చేసింది. ఈ కేసులు చూస్తే చాలా భ‌యాన‌కంగా ఉంది. గ‌త 24 గంట‌ల్లో 16488 మందికి కరోనా నిర్ధారణ అయింది. అదే సమయంలో 12771 మంది కోలుకున్నారు.  ఇప్ప‌టి వ‌ర‌కు మ‌న దేశంలో నమోదు అయిన కొత్త కేసులు చూస్తే  11079979గా ఉన్నాయి. ఇక గ‌త 24 గంట‌ల్లోనే క‌రోనాతో 113 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 156938కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 10763451 మంది కోలుకున్నారు. 159590 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు హోం క్వారంటైన్ లలో చికిత్స అందుతోంది. ఇప్పటివరకు 14242547 మందికి వ్యాక్సిన్ వేశారు. ఇక మ‌ర‌ణాల సంఖ్య 113గా ఉండ‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని చెపుతున్నారు. దీంతో దేశ‌వ్యాప్తంగా మ‌ళ్లీ క‌రోనా కొత్త భ‌యంగా మారింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: