భారత్లో కరోనా వేవ్ మళ్లీ ప్రారంభమైందన్న వార్తలు ప్రతి ఒక్కరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. అయితే ఒక్క రాష్ట్రం మాత్రం ఫ్రీ కరోనా స్టేట్గా రికార్డులకు ఎక్కింది. ఆ ఘనత అరుణాచల్ ప్రదేశ్ కు దక్కింది. ముగ్గురు కరోనా నుంచి బయటపడటంతో కరోనా ఫ్రీ రాష్ట్రంగా అరుణాచల్ ప్రదేశ్ నమోదయింది. ఆదివారం ఈ మేరకు అరుణాచల్ ప్రదేశ్ అధికారులు ప్రకటించారు. రికవరీ రేటు కూడా అరుణా చల్ ప్రదేశ్ లో 99.66 శాతంగా ఉంది. అరుణాచల్ ప్రదేశ్ లో కరోనా తో ఇప్పటి వరకూ కేవలం 56 మంది మాత్రమే మరణించారు. దీంతో అరుణాచల్ ప్రదేశ్ రికార్డులకు ఎక్కింది.
మరింత సమాచారం తెలుసుకోండి: