ఏపీలో కార్పొరేష‌న్ ఎన్నిక‌ల వేళ అధికార వైసీపీ చాలా చోట్ల ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌తో ప‌లు పార్టీల నేత‌ల‌ను త‌న వైపున‌కు తిప్పుకుంటోంది. అయితే కీల‌క‌మైన విజ‌య‌వాడ న‌గ‌రంలో ఆ పార్టీకే పెద్ద దెబ్బ త‌గిలింది. ఆ పార్టీ కీల‌క నేత గుడ్ బై చెప్పేశారు.  కార్పొరేషన్ ఎన్నికల సమయంలో వైసీపీ బీసీ సెల్‌ అధ్యక్షుడు బోను రాజేష్ తన పదవికి రాజీనామా చేశారు. వైసీపీ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు.

రాజేష్ గ‌త ఎన్నిక‌ల్లో కార్పొరేట‌ర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఆయ‌న పార్టీలో ఉంటూ పార్టీ బీసీ సెల్ అధ్య‌క్షుడిగా ఉన్నారు. తాజా ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు కాద‌ని వేరే వ్య‌క్తికి సీటు ఇవ్వ‌డంతో ఆయ‌న తీవ్ర మ‌న‌స్థాపానికి గుర‌య్యి పార్టీని వీడారు. కార్పొరేష‌న్ ఎన్నికల వేళ బోను రాజేష్ రాజీనామా అధికార పార్టీకి ఇబ్బంది కరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: