టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి చిత్తూరు జిల్లా పోలీసులు షాక్ ఇచ్చారు. తిరుపతిలో  టిడిపి నేత చంద్రబాబు నాయుడు  ఈ రోజు చేపట్టనున్న నిరసనలలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఎన్నికల కోడ్ నిబంధనలు వున్నందున చంద్రబాబు నాయుడు  నిరసనలకు అనుమతించటం లేదు అని పోలీసులు చెప్తున్నారు. టీడీపీ  అధినేత  తిరుపతి లో ఈ రోజు సాయంత్రం 4 గంటలకు గాంధీ విగ్రహాల వద్ద  నిరసనలు  చేపట్టాలని  నిర్ణయం తీసుకున్నారు.
 
తిరుపతి గాంధీ విగ్రహం వద్ద నిరసనలకు  అనుమతిలేదని  టీడీపీ  పార్టీ కార్యాలయానికి,తిరుపతి మాజీ ఎమ్మెలే సుగుణమ్మకు,  నరసింహ యాదవ్ కు పోలీసులు నోటీసులు జారీ చేసారు. కార్యక్రమానికి అనుమతి కోరుతూ నిన్ననే టీటీడీ నేతలు లేఖ ఇచ్చినా, అర్ధ రాత్రి అనుమతి నిరకరిస్తున్నట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే చంద్రబాబు నాయుడు విమానాశ్రయం నుంచి బయటకు వెళ్ళకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో ఆయన విమానాశ్రయంలో కింద కూర్చుని నిరసన తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: