టీడీపీ అధినేత‌, ఏపీ మాజీ సీఎం చంద్ర‌బాబుకు తిరుప‌తి పోలీసులు షాక్ ఇచ్చారు. ఈ రోజు ఆయ‌న అక్క‌డ నిర‌స‌న కార్య‌క్ర‌మం చేపట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు. అయితే పోలీసులు అక్క‌డ ఎన్నిక‌ల నియ‌మావ‌ళి అందుబాటులో ఉండ‌డంతో అనుమ‌తి ఇవ్వ‌డం కుద‌ర‌ద‌ని తేల్చిచెప్పారు. వాస్త‌వంగా షెడ్యూల్ ప్ర‌కారం చంద్ర‌బాబు ఈ రోజు సాయంత్రం తిరుప‌తిలోని గాంధీ విగ్ర‌హం వ‌ద్ద నిర‌స‌న చేప‌ట్టాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  వైసీపీ అరాచకాలకు నిరసనగా ఈ కార్యక్రమం టీడీపీ చేపట్టింది. ఈ నిర‌స‌న‌కు ముందుగానే అనుమ‌తి కోసం పోలీసులు లేఖ రాసినా ఎన్నిక‌ల నియ‌మావ‌ళి నేప‌థ్యంలో పోలీసులు దీనికి అనుమతి ఇవ్వ‌క‌పోవ‌డంతో చంద్ర‌బాబుకు షాక్ త‌గిలినట్ల‌య్యింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: