.దేశంలో కొత్త‌గా న‌మోదైన క‌రోనా కేసుల వివరాలను కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమ‌వారం ఉదయం విడుదల చేసింది. వాటి ప్రకారం, దేశంలో గత 24 గంటల్లో 15,510 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్దార‌ణ అయ్యింది. ఇక ఈ స‌మ‌యంలోనే క‌రోనా నుంచి 11 వేల మంది కోలుకున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న లెక్క‌ల ప్ర‌కారం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,11,12,241కు చేరింది.

గ‌త  24 గంటల్లో 106 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,157 కు పెరిగింది. ఇక దేశ వ్యాప్తంగా ప్ర‌స్తుతం 1,68,627 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు 1,43,01,266 మందికి వ్యాక్సిన్ వేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: