టీడీపీ సీనియ‌ర్ నేత‌, పోలిట్‌బ్యూరో స‌భ్యుడు వ‌ర్ల రామ‌య్య‌కు అఖిల‌ప‌క్ష స‌మావేశంలో ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ కుమార్ చేతిలో ఘోర అవ‌మానం ఎదురైంది. ఈ స‌మావేశంలో నిమ్మ‌గ‌డ్డ మాట్లాడుతుండ‌గా ప‌దే ప‌దే వ‌ర్ల రామ‌య్య ఆయ‌న‌కు అడ్డు త‌గిలారు. చివ‌ర‌కు చిర్రెత్తుపోయిన నిమ్మ‌గ‌డ్డ వ‌ర్ల‌ను సెక్యూరిటీతో బయటకు పంపారు. అన్ని పార్టీల నేతలతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశంలో అన్ని పార్టీలూ నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.

ఈ క్ర‌మంలో అన్ని పార్టీల నేత‌లు మాట్లాడగా త‌ర్వాత నిమ్మ‌గ‌డ్డ త‌న అభిప్రాయం చెప్ప‌బోయారు. ఆయ‌న స్పీచ్‌కు వ‌ర్ల రామ‌య్య ప‌దే ప‌దే అడ్డు త‌గులుతుండ‌డంతో చివ‌ర‌కు సెక్యూరిటీతో ఆయ‌న్ను బ‌య‌ట‌కు పంపించి వేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: