ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల వేళ చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. గత యేడాది నామినేష‌న్లు వేసిన కొంద‌రికి ఇప్పుడు ప‌లువురు పార్టీ నేత‌లు షాక్ ఇస్తున్నారు. తాజాగా విజయవాడ 30వ డివిజన్‌లో పార్టీ అభ్యర్థికి వైసీపీ షాక్‌ ఇచ్చింది. ఈ డివిజన్‌ నుంచి మూర్తి శ్రీమహావిష్ణు పార్టీ అభ్యర్థిగా గ‌త యేడాది నామినేష‌న్ వేశారు. ఆయ‌న్ను అప్పుడు ఎమ్మెల్యే మ‌ల్లాది విష్ణుయే స్వ‌యంగా పార్టీ అభ్య‌ర్థిగా ఎంపిక చేశారు.

ఆయ‌న క‌రోనాతో మృతి చెంద‌డంతో ఆయ‌న వ‌దిన సుధారాణి పార్టీ అభ్య‌ర్థి అనుకున్నారు. ఇప్పుడు జానారెడ్డి అనే వ్య‌క్తికి ఎమ్మెల్యే విష్ణు బీ ఫామ్ ఇస్తున్నారు. దీనిపై సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు కార్యాలయానికి వచ్చి ఆందోళన చేశారు. తాము పార్టీకి విధేయులుం అని.. త‌మ‌కే కార్పొరేట‌ర్ సీటు ఇవ్వాల‌ని ఆమె డిమాండ్ చేస్తున్నారు. జానారెడ్డి 2014లో వైసీపీ కార్పొరేట‌ర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: