వైఎస్ షర్మిల అనుచరుడు తూడి దేవేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు.  షర్మిల పై రేవంత్ రెడ్డి చేసిన వాఖ్యలు  ఖండిస్తున్నాం అన్నారు.  రేవంత్ కాంగ్రెస్ లో ఎన్ని రోజుల క్రితం చేరాడో అందరికీ తెలుసు అని, సమ్మేళనం లో ఒక  విద్యార్థి తండ్రి నీ కోల్పోయాను అని బాధపడితే షర్మిళ ఓదార్చారు అన్నారు. ఇది రాజకీయం అని రంగు పులిమారు అని మండిపడ్డారు.  షర్మిల రాజకీయంగా ఎదుగుతున్నారు అని రేవంత్ తట్టుకోలేక పోయారు అని ఆయన వ్యాఖ్యానించారు.  కాంగ్రెస్ పార్టీ కి తెలంగాణ లో రోజులు లేవు అని ఎద్దేవా చేసారు.

 రాజశేఖర్ రెడ్డి పేరు ను రేవంత్ వాడుకోవాలని అనుకున్నారు అని,  రాజశేఖర్ రెడ్డి నీ గతం లో దూషించి ఇప్పుడు కాంగ్రెస్ లో పొగుడుతున్నారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు. మేము లేనప్పుడే కేసీఆర్ కాంగ్రెస్ ను ఓడించారు అని అన్నారు. త్రీ కార్నర్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం షర్మిల కు లేదు అని ఆయన స్పష్టం చేసారు. ఏప్రిల్ 9 న షర్మిల పార్టీ ప్రకటన ఉంటుందని చెప్పారు. ఖమ్మం సభలో ఈ ప్రకటన ఉంటుందని స్పష్టం చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: