ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌. జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సోమ‌వారం పోల‌వ‌రం ప్రాజెక్టుపై స‌మీక్ష చేయ‌డంతో పాటు ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. మే చివ‌రి నాటికి కాఫ‌ర్ డ్యాం ప‌నులు పూర్తి చేయాల‌ని నిర్ణ‌యించారు. గ‌త ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌తో ప్రాజెక్టు ప‌నుల్లో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామ‌న్న జ‌గ‌న్ స్పిల్‌ వే పూర్తికాకుండా కాఫర్‌ డ్యాం నిర్మాణం వల్ల ఇబ్బందులు వచ్చాయన్నారు.  స్పిల్‌ ఛానల్, అప్రోచ్‌ఛానల్‌ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. మే నెలాఖరు నాటికి కాపర్‌ డ్యాం పనులను పూర్తి చేస్తామని అధికారులు సీఎం జగన్‌కు తెలియజేశారు. పోలవరం సహాయపునరావాస కార్యక్రమాలపైన సీఎం జగన్‌ సమీక్షించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: