ఏపీలో కార్పొరేషన్ ఎన్నికల సాక్షిగా టీడీపీకి టీడీపీకి గట్టి షాక్ తగిలింది. కర్నూలు మాజీ మేయర్ బంగి అనంతయ్య వైసీపీలో చేరారు. ఆయన గతంలో కర్నూలు మేయర్గా పని చేశారు.
తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నో దశాబ్దాలుగా ఆయన అనేక రూపాల్లో నిరసన గళాలు వినిపిస్తూ వచ్చారు.
పార్టీ అధిష్టానం పట్టించుకోవడం లేదన్న కారణంతో ఆయన కొద్ది రోజులుగా తీవ్ర అసంతృప్తితో ఉంటున్నారు. ఇక తాజాగా ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం వైసీపీలో చేరక తప్పలేదు. జగన్ సంక్షేమ పథకాలు నచ్చే తాను వైసీపీలో చేరారని బంగి అనంతయ్య తెలిపారు.