తెలంగాణలో ఓ ఎక్స్‌ప్రెస్ రైలు రెండుగా విడిపోయింది. స్టేషన్ ఘనపూర్ లో  సికింద్రాబాద్ నుండి దానాపూర్ బయలుదేరిన  2791 ఈ నెంబర్ గల దానాపూర్ ఎక్స్ ప్రేస్ స్టేషన్ ఘనాపూర్ లోని రైల్వే గేటు దాటాక  ఇంజన్, భోగిని కలిపి ఉన్న లింకు ఉడిపోవడంతో బోగీల నుండి ఇంజ‌న్ విడిపోయింది. 250 మీటర్ల వరకు వెళ్లిన ఇంజన్ ను చూసిన రైల్వే స్టేషన్ సిబ్బంది ఇంజన్ బోగీల లింక్ చేసి తిరిగి యథావిధిగా పంపించారు. ఈ ఘ‌న‌ట‌తో రైల్లో ఉన్న ప్ర‌యాణికులు ఒక్కసారిగా షాక్‌కు గుర‌య్యారు. ఈ సంఘటనలో స్టేషమ్ ఘనపూర్ లో 10:54  నుండి 11:22 సుమారు 28 నిమిషాల పాటు రైల్వే గేట్ లోనే ట్రైన్  నిలిచిపోయింది..

మరింత సమాచారం తెలుసుకోండి: