నగరంలో భారీగా నల్లడబ్బు వెలుగులోకి వచ్చింది. బోగస్‌ కంపెనీల ద్వారా అవకతవకలకు పాల్పడుతోన్న ఓ ప్రసిద్ధ ఫార్మాస్యూటికల్‌ కంపెనీ వద్ద ఐటీ అధికారులు సుమారు రూ.400 కోట్ల నల్లడబ్బును గుర్తించారు. ఇంత భారీ మొత్తంలో న‌ల్ల‌డ‌బ్బు బ‌య‌ట‌కు రావ‌డంతో న‌గ‌రంలో పెద్ద సంచ‌ల‌న‌మైంది.
గత నెల 24న ఐటీ అధికారులు నగరంలో ప్రసిద్ధి చెందిన ఓ ఫార్మస్యూటికల్‌ కంపెనీపై దాడులు చేశారు.

ఈ ఫార్మ‌స్క్యూటిక‌ల్ కంపెనీ ప‌లు బోగ‌స్ కంపెనీలు క్రియేట్ చేసి ఎన్నో అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డిన‌ట్టు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.400 కోట్ల  నల్లధనం ఉన్నట్లు కనుగొన్నారు. ఈ క్రమంలో అధికారులు రూ.1.66 కోట్ల నగదు, కీలక పత్రాలు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: