గత నెల 24న ఐటీ అధికారులు నగరంలో ప్రసిద్ధి చెందిన ఓ ఫార్మస్యూటికల్ కంపెనీపై దాడులు చేశారు.
ఈ ఫార్మస్క్యూటికల్ కంపెనీ పలు బోగస్ కంపెనీలు క్రియేట్ చేసి ఎన్నో అవకతవకలకు పాల్పడినట్టు అధికారులు గుర్తించారు. మొత్తం రూ.400 కోట్ల నల్లధనం ఉన్నట్లు కనుగొన్నారు. ఈ క్రమంలో అధికారులు రూ.1.66 కోట్ల నగదు, కీలక పత్రాలు, పెన్డ్రైవ్లు, హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు.