ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్
జగన్ రేపు
ఢిల్లీ వెళ్లనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆయన తన
ఢిల్లీ పర్యటనలో
కేంద్ర హోం శాఖా
మంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు.
అమిత్ షా అపాయింట్ మెంట్ కోసం సీఎంవో వర్గాలు ఇప్పటికే కోరినట్టు సమాచారం. షా అపాయింట్ మెంట్ దొరికితే
జగన్ రేపు
ఢిల్లీ వెళతారు. ప్రధానంగా రాష్ట్ర సమస్యలతో పాటు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ అంశాన్ని కూడా చర్చించే అవకాశముందని తెలిసింది. ఏదేమైనా
విశాఖ స్టీల్ ప్లాంట్పై ఎవ్వరూ మాట్లాడవద్దని
అమిత్ స్పష్టం చేసిన నేపథ్యంలో జగన్ ఏం అడుగుతారన్నదే టెన్షన్గా ఉంది.