నామినేషన్లు వేయని 12 పంచాయతీలు, 725వార్డుల్లో  మళ్లీ ఎన్నికలు నిర్వహించనుంది ఏపీ ఎన్నికల సంఘం.  పంచాయతీ ఎన్నికల్లో నామినే షన్లు వేయని సర్పంచి , వార్డు స్థానాలకు మరోసారి ఎన్నికలునిర్వహిస్తారు. ఈ నెల 15 న పోలింగ్ నిర్వహించాలని నోటిఫికేషన్  విడుదల చేసింది ఎన్నికల సంఘం. శ్రీకాకుళం , విశాఖపట్నం , ప్రకాశం , నెల్లూరు , కడప , కర్నూలు , అనంతపురం జిల్లాల్లో 12 సర్పంచి స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు.

రాష్ట్ర వ్యాప్తంగా మరో 725 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. గత ఎన్నికల్లో పలు కారణాలతో నామినేషన్లు వేయని పంచాయతీల వివరాలను ఎన్నికల సంఘానికి కలెక్టర్లు  పంపించారు. వీటికి మరోసారి ఎన్నికల కోసం  ప్రకటన విడుదల చేసారు. సర్పంచి , వార్డు స్థానాల కోసం ఈనెల 4 నుంచి 6 వరకు నామినేషన్లు స్వీకరణ ఉంటుంది. ఈనెల నామినేషన్ల  7 న పరిశీలన , 10 న ఉపసంహరణ ఉంటుంది. అదే రోజు 3 గంటల తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను అధికారులు ప్రకటిస్తారు. ఈనె  15న  పోలింగ్ ముగిశాక  ఓట్లు లెక్కింపు, విజేతలను ప్రకటన ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: